NZB: నవీపేట్ మండలం కోస్లీలోని 33/11 కేవీ సబ్ స్టేషన్లో మంగళవారం ఉదయం 8 గంటలకు ఎంవీఏ నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణల ఈ పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బాబు సింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్లో వోల్టేజీ సమస్య తీరుతుందని అధికారులు తెలిపారు.