GNTR: పిడుగురాళ్ల సర్వజనాసుపత్రి, పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న 150 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు గుంటూరు జోన్-3 ప్రాంతీయ వైద్య, ఆరోగ్య సంచాలకులు శోభారాణి తెలిపారు. ఒప్పంద విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైనవారు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.