TG: పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజితగా గుర్తించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టంకి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.