NTR: వీరులపాడు మండలంలో పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. పెద్దాపురానికి చెందిన ఎస్కే మేరాబీ, జుజ్జూరుకు చెందిన జల్లి సంగీతరావు తమ ఫోన్లు పోయినట్లు CEIR పోర్టల్లో ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించిన ఎస్సై అభిమన్యు, సోమవారం బాధితులను పిలిపించి స్టేషన్లో ఫోన్లను అందజేశారు.