T20 ప్రపంచకప్లో భాగంగా ఇవాళ టీమిండియా, జింబాబ్వే తలపడనున్నాయి. అయితే సూపర్-8లో టీమిండియాకు వెస్టిండీస్తో కన్నా.. జింబాబ్వేతోనే ఎక్కువ ముప్పు ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. కాగా సూపర్ -8లో సౌతాఫ్రికాతో భారత్ తలపడగా ఓడిపోయింది. దీంతో వెస్టిండీస్, జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది.