TG: యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా సాయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. సంక్రాంతికి, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినా.. ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. నిన్న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.