VSP: మహిళలు, విద్యార్థినుల భద్రతే పోలీసుల ప్రాధాన్యమని సీఐ తిరుమలరావు అన్నారు. కేజీబీవీ పాఠశాలలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో సైబర్ నేరాలు, ఈవ్టీజింగ్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘దిశ’ యాప్ అత్యవసర సమయంలో రక్షణగా పనిచేస్తుందని వివరించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఘటనలను 100/112కు తెలియజేయాలని చెప్పారు.