SKLM: ఇద్దివానిపాలెంలో గురువారం ప్రత్యేక గ్రామసభనిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అధికారి కె. శ్రీనివాసరావు, సెక్రటరీ పంచాయతీ తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. గ్రామ ప్రజల సమక్షంలో లిస్ట్ను ప్రదర్శించి వివరాలను చూపించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, మార్పుల గురించి చర్చించారు.