ఏలూరు 1వ పట్టణానికి చెందిన చింటూ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికపై దాడికి పాల్పడినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అలంకరణ పనులు చేసే నిందితుడు, ఏప్రిల్ 2న బాలికను విజయవాడ తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.