AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు మరోసారి వ్యాఖ్యలు చేశారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి నైవేద్యం పెట్టారని ఆరోపించారు. ప్రజలకే కాదు దేవుడికి కూడా ద్రోహం చేయాలనుకున్నారని మండిపడ్డారు. దేవుడిని తాను బజారులోకి లాగాలనుకోలేదని పేర్కొన్నారు. కానీ, జరిగిన తప్పులను ప్రజలకు వివరించానని వెల్లడించారు.