AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కళ్యాణదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు 41ఏ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్ లలో రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. కాగా, ఇటీవల అంబటి జైలుకెళ్లి విడుదలైన విషయం తెలిసిందే.