AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. మొత్తం 55 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదం లభించింది. అలాగే.. విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యాసాయి, చీరాల, రాజమండ్రిలో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది.