TG: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును ఉద్దేశించి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టొద్దని తెలిపారు. బాపు బతికి ఉంటే ‘నా పేరు మీద ఇలాంటివి చేయొద్దు, వెంటనే ఆపండి’ అని చెప్పేవారని పేర్కొన్నారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమన్నారు.