TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని KCR గతంలోనే చెప్పారని జాగృతి అధ్యక్షురాలు కవిత గుర్తు చేశారు. KCR, BRSను టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని వెల్లడించారు. ఐదున్నర నెలలు తనను జైలులో పెట్టి కుటుంబానికి దూరం చేశారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. తన తల్లిదండ్రులు, భార్త అండగా నిలిచారన్నారు.