AP: పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత వైసీపీదేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఎద్దేవా చేశారు. పరకామణి కేసులో నిందితుడితో జగన్ రాజీపడ్డారని తెలిపారు. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. శ్రీవారి తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన ఘనత కూడా వైసీపీ నేతలదేనని మండిపడ్డారు.