TG: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ముందుండే మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో అటుగా మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి.. తన కాన్వాయ్ని ఆపి రోడ్డుపై ఉన్న మృతదేహాలను పక్కకు తీశారు.