KMM: వైరా మండల పరిధిలోని లింగన్నపాలెం గ్రామంలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 22 ఆవులకు, 155 గేదెలకు పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువుల యజమానులకు మండల పశువైద్యాధికారి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు.