KMM: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.