MBNR: రాజాపూర్ మండలం ఇబ్రహీంపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుందని తెలిపారు.