NRPT: మక్తల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో పలు గ్రామాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి చెక్కులు అందజేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.