TG: ఫిబ్రవరి ముగియకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రేపట్నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 22 జిల్లాల్లో 35-36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందంటూ.. ఆయా జిల్లాలకు మెల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు జిల్లాల్లో 15-20 మధ్య నమోదవుతున్నాయి.