TG: రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో కొన్ని చోట్ల మహిళలు ఎన్నికయ్యారు. అయితే ఆ స్థానంలో వారి భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వీటిని అధికారులూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్మూరులో అయితే ఏకంగా మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది.