TG: దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని సీపీఐ నేత నారాయణ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయాలని.. లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు. రాజకీయ అవినీతిని ప్రజలకు వివరించడం కోసం ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్ని విధాలుగా భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.