SKLM: సింగుపురంలో బాదం పాలు తాగి 80 అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ స్పందించారు. శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి మంత్రి ఆరాతీశారు. బాధితులు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.