MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన పులిగుజుల అనూష (22)ను ఆమె భర్త సాయి అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురై, ఇంట్లో ఎవరు లేని సమయంలో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.