కర్నూలు జిల్లాలో ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం హెచ్చరించారు. అత్యవసరం పేరుతో నగదు తీసుకుని ఫోన్పే, గూగుల్ పే చేశామని చూపిస్తూ మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్లో పడిపోవడం వల్ల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.