PLD: పిడుగురాళ్ల పట్టణంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ క్రీడలు మొదలయ్యాయి. పలువురు ముఖ్య అతిథులు హాజరై ఈ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని రాణించాలని వారు సూచించారు. ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి పలు జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి.