W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం చినతాడేపల్లి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగించి అమరావతి రాజధానికి సంఘీభావం తెలియచేయడం జరిగింది. ఇదే రీతిలో పలువురు టీడీపీ నాయకులు తమ తమ గ్రామాల్లో కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించారు.