అన్నమయ్య: జువ్వలదిన్నెలో రూ.45 కోట్లతో ఆటానమస్ మారిటైమ్ షిప్యార్డ్ ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో 25 వేల మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూరుతుందని, అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. షిప్బిల్డింగ్, మెరైన్ ఇంజినీరింగ్ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని అన్నారు.