MDK: రామాయంపేట మున్సిపల్ మాజీ కమిషనర్ దేవేందర్ ఆదివారం కన్నుమూశారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామాయంపేటలో రెండు సంవత్సరాల పాటు కమిషనర్గా సేవలందించి, తనదైన ముద్ర వేసుకున్న ఆయన మరణవార్త విని స్థానికులు దిగ్భ్రాంతి చెందారు.