ASR: అనంతగిరి మండలం పల్లంవానివలస గ్రామంలో సోమవారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీంతో ప్రభుత్వం జారీచేసిన రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను ఆర్డీవో లోకేశ్వరరావు, తహసీల్దార్ వీరభద్రాచారి, ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.