GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ గారి సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.