AP: కాకినాడ జిల్లా ఒమ్మంగిలో దారుణం చోటుచేసుకుంది. ఆటో సీటు చింపాడని పక్కింటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఓ తండ్రి తన ఏడేళ్ల కుమారుడిని ఇనుప చువ్వలతో కొట్టి, దారుణంగా వాతలు పెట్టాడు. ఊరి నుంచి వచ్చిన తన సోదరి చూసేటప్పటికి బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. చలించిపోయిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు.