AP: రాష్ట్ర ప్రభుత్వం, భారత్ నెట్ మధ్య ఇవాళ ఎంవోయూ కుదరనుంది. సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ అందించడం, డిజిటల్ సేవలను విస్తరించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొననున్నారు.