చెన్నైలో ఇవాళ సాయంత్రం ప్రపంచ శాంతి సదస్సు జరగనుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. ఈ సదస్సును 200 దేశాల నుంచి 200 కోట్ల మంది ఫాలో అవుతారన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ఈ సదస్సు అని, దీనికి సీఎం స్టాలిన్ వస్తే ప్రపంచ శాంతి దూత అవుతారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించామన్నారు.