AP: సీఎం చంద్రబాబు తమిళనాడులో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు వెళ్లనున్నారు. హోసూరు, చెన్నై, కోయంబత్తూరు, ఆవడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హోసూరు సమీప తాలిలోని సభలో ప్రసంగించనున్నారు. ఆవడిలో రోడ్ షో నిర్వహంచనున్నారు. మధురై-సాత్తూర్లో ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు.