AP: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో భారీ చోరీ జరిగింది. బీఎన్ రోడ్డు పక్కనే ఉన్న సుజాత అనే మహిళ ఇంట్లో 65 తులాల బంగారం, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. నగదుతో కలిపి మొత్తం రూ.1.5 కోట్లు చోరీకి గురై ఉంటుందని అంచనా. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.