TG: వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మూడేళ్ల బాలిక దివ్య బేహారాను పంట పొలాల్లోకి వీధి కుక్కలు లాకెళ్లి పీక్కుతున్నాయి. మరో ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నాగరాజు అనే మరో వ్యక్తిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది.