AP: విభజన తర్వాత APకి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందని MP పురంధేశ్వరి అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా AP ప్రస్థానం ప్రారంభమైందన్నారు. అమరావతికి భూమి ఇచ్చేందుకు 29 వేల మంది రైతులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని వెల్లడించారు. YCP హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొందని.. ఆ పార్టీ అవివేకమైన నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.