AP: రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో YCP మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని YCP MP గురుమూర్తి స్పష్టంచేశారు. అలాగే ఇవాళ జరిగే చర్చలో MP మిథున్ రెడ్డి పాల్గొని.. అమరావతిపై తమ పార్టీ విధానం ఏమిటో వినిపించనున్నారు. బిల్లుపై మిథున్ రెడ్డితో పాటు ఐదుగురు TDP ఎంపీలు, జనసేన ఎంపీ బాలశౌరి కూడా చర్చించనున్నారు.