AP: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ కోరుకొండ మండలం నరాసాపురానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందంతో కలిసి పాలతయారీ కేంద్రం వ్యాపారి ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో వినియోగదారులు, పశువుల రక్త నమూనాలు సేకరించారు. అలాగే వ్యాపారి ఇంట్లోని వెనిగర్, పాలు, కెమికల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.