TG: కొత్త వాహనాలు కొనేవారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాహనాలపై ‘రహదారి భద్రత పన్ను’ విధిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. వాహన రకాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.