బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెపై సైబర్ వేధింపులకు పాల్పడిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ విభాగం నిందితుడిని పట్టుకుంది. వేధింపులపై ఆమె ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని త్వరగా పట్టుకోగలిగామని ADG యశస్వి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.