నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న మూవీ ‘రామాయణ’. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానుంది. తాజాగా లాస్ ఏంజిల్స్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ వీడియోను ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకులు దీని విజువల్స్ చూసి మంత్రముగ్ధులయ్యారు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.