SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 10:30 గంటలకు హిరమండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 23 పంచాయతీల సర్పంచుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం చేపడుతారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.
AP: 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన P4 వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ విజన్లో భాగంగా సంపద, ఆరోగ్యం, ఆనందంతో కూడిన అభివృద్ధిని సాధించడమే P4 లక్ష్యమని ఆయన తెలిపారు.
RR: చేవెళ్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ న్యాయమూర్తి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ న్యాయమూర్తి విజయ్ కుమార్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.
IPL 2026లో భాగంగా RRతో జరుగుతున్న మ్యాచ్లో CSK ఇన్నింగ్స్ ముగిసింది. RR బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.4 ఓవర్లలో చెన్నై 127 పరుగులకే ఆలౌట్ అయింది చేసింది. ఓవర్టన్(43) తప్ప మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో జడేజా, బర్ఘర్, ఆర్చర్ తలో రెండు వికెట్లు, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేష్ తలో వికెట్ తీశారు. RR టార్గెట్: 128.
ADB: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోమవారం బోథ్ పట్టణంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో SP అఖిల్ మహాజన్తో సమావేశమై మాట్లాడారు. నిర్లక్ష్యం, వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
KNR: జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీశాయని పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యా దు చేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీ నూతన పాలక మండలి మొదటి సమావేశంలో 2026-27 సంవత్సరం ముసాయిదా బడ్జెట్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత రూ.107.30 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టగా పాలకమండలి ఆమోదించింది. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
కామారెడ్డిలో సోమవారం హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసింది. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా రోడ్డులో నూతనంగా విశాల షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ హాజరయ్యారు. హీరోయిన్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు.
NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అద్భుతం చోటుచేసుకుంది. సాయంత్రం 6.3 నిమిషాలకు అమ్మవారి గర్భం గుడి పైనుంచి సూర్యకిరణాలు ప్రసరించడంతో భక్తులు ఆనంద పర్వసులైనారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చూడలేదని భక్తులతో పాటు ఆలయ సిబ్బంది కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
MDK: తూప్రాన్ పట్టణ పశువుల సంత, తై బజార్ వేలం ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు. ఈనెల 18న, 25న, 30న వేలం పాటల కోసం టెండర్ల ఆహ్వానించినప్పటికీ ఒక్కరే రావడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఇవాళ సైతం వేలం పాటలో ఒక్కరే డీడీ చెల్లింపు చేయడంతో దీన్ని మళ్లీ ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు కమిషనర్ వివరించారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు, నాణ్యతతో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో 111 అర్జీలు అందగా, వాటిలో 25 రెవిన్యూ శాఖవి కాగా, ఇతర శాఖలకు చెందినవి 86 అందాయని అన్నారు.
KMR: తమకు గ్రామంలోని ఆలయాల్లో ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చి ఉన్నతాధికారులు రాకపోవడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలను పంపడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు చివరకు ఆర్డీవోతో ఫోన్ మాట్లాడించడంతో దళితులు శాంతించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నేషనల్ హైవేపై ఎదురవుతున్న ప్రమాదాల నివారణకు ఎంపీ బీకే పార్థసారధి కీలక చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ను ఇవాళ కలిసి కొడికొండ, పాలసముద్రం, సోమందేపల్లి, పెనుకొండ, ముక్తాపురం, మరూరు, రాప్తాడు, తపోవనం ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లపై వివరించారు.
HYD: కాలనీ రహదారుల కబ్జాలపై హైడ్రా ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డెడ్ ఎండ్ రోడ్లను మూసివేయడం, కాలువలను అడ్డుకోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల రహదారులు, పార్కులు, కాలువల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తమైంది. మొత్తం 58 ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంబంధిత అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
NZB :కమ్మర్పల్లిలో జిల్లా సివిల్ సప్లై అధికారులు సోమవారం పలు హోటల్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో అక్రమంగా నిల్వ ఉన్న 11 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి, 7 గురిపై కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాస్, వినోద్, ప్రవీణ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది వాల్మీకి గౌడ్, జీపిఓస్ శ్రీకాంత్, గంగాధర్, అజయ్, సాయిరాం పాల్గొన్నారు.