అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి 19 పైసలు క్షీణించి, చరిత్రలో తొలిసారిగా రూ.93.08కి చేరింది. ముడి చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ప్రియమై, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉంది.