AP: పల్నాడు జిల్లా మాచర్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటికి ‘దాహంగా ఉంది, నీళ్లు కావాలి’ అంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లోని మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని ఓ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.