విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సాయి కృష్ణ బార్ సమీపంలో ముగ్గురు యువకులు ఓ వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు, నిందితుల వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
W.G: ఆకివీడులో వంట గ్యాస్ కొరత తీవ్రమైందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం వల్ల సిలిండర్లు రావడానికి 13 రోజులు పడుతోందని, ఆన్లైన్ బుకింగ్లోనూ ఇబ్బందులు ఉన్నాయని వాపోతున్నారు. దీంతో గ్యాస్ కావాలంటే బయట మార్కెట్లో రూ.1800 పెట్టి కొనాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. సిలిండర్ దొరకడమే మహాభాగ్యంగా మారిందని స్థానికులు వాపోతున్నారు..
VZM: 2025లో మహిళ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి సోమవారం తీర్పు వెల్లడించారు. ఎస్పీ దామోదర్ వివరాల మేరకు విజయనగరనికి చెందిన ప్రేమ్ కుమార్ ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా అనుభవించి మోసం చేసినట్లు చెప్పారు.
KDP: ఉపాధి పనులు వేగవంతం చేయాలని కమలాపురం క్లస్టర్ అసిస్టెంట్ పథక సంచాలకుడు ఆజాద్ ఉపాది సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలంలో ప్రతిరోజు 2,000 మంది కూలీలు పనిచేయాలి, వంద రోజులు పూర్తి చేసే కుటుంబాలు 1,000 వరకు ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సమీక్షలో ఉపాధి హామీ ఎపీవో రామాంజులరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
AKP: రాంబిల్లి మండలం భోగాపురం గ్రామానికి చెందిన వివాహిత పక్కుర్తి కుమారి (43)పాముకాటుతో మృతి చెందింది. కూలి పనికి వెళుతుండగా సోమవారం విషపూరితమైన పాము కాటు వేసింది. ఆమె భర్త కొండబాబు ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
KRNL: ఆదోని మండలం పెద్దతుంబలంలో పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 4 రోజులు కావొస్తున్నా పెట్రోల్ బంక్లలో సరఫరా నిలిచిపోవడంతో వాహనదారులు బాధలు వర్ణనాతీతం. ఇదే అదునుగా భావించిన కొందరు ఎలాంటి కొలతలు లేకుండా ఇష్టమొచ్చిన విధంగా పెట్రోల్ అధిక ధరలకు అమ్ముతున్నారు. బాటిళ్లను నింపి, వాహనదారులను మోసం చేస్తున్నారు.
SKLM: కొత్తూరు మండలం మెట్టూరు బిట్ 2 పంచాయతీలో లో-ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ప్రజలు సోమవారం వినతిపత్రం అందించారు. మెట్టూరు బిట్ 2 పంచాయతీలో లో-ఓల్టేజ్ సమస్య ఎప్పటి నుంచో ఉందని వారు ఎమ్మెల్యేకి తెలిపారు. పరిష్కారానికి చర్యలు చేపడతారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
E.G: రాజమహేంద్రవరం నగరంలోని లాస్పిన్ హోటల్లో బస చేసిన రాష్ట్ర బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను ఏపీ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర నాయకులు జయరాజు, ఆర్ఎస్ఎన్ మూర్తి జిల్లా ప్రతినిధులు మంత్రితో సమావేశమై ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ELR: చింతలపూడి కార్యాలయంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన వారిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా వచ్చిన వినతులను పరిశీలించి బాధితులకు పరిష్కారం చేయవలసిందిగా ఆయా శాఖ అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రైలుపేటలో ఉన్న హోటల్ సుప్రీం ఇన్లో వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. కొత్తపేట పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల బీచ్ ఫెస్టివల్లో చేతివాటం ప్రదర్శించిన దొంగను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బిట్రగుంట మండలం బోగోలుకు చెందిన సునీల్ చోరీలకు పాల్పడే క్రమంలో ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మద్దిరాల గంగమ్మ (60) అనే వృద్ధురాలు మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
VZM: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వైసీపీ గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు త్వరతిగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం గరివిడిలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. అలాగే, స్థానిక ఎన్నికలో వైసీపీ జెండా ఎగరాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు.
SS: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ సతీష్ కుమార్ 50 అర్జీలను స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
KDP: వంట గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో హోటళ్లకు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ ఆధ్వర్యంలో పులివెందులలో రెవెన్యూ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడుల విషయం తెలుసుకున్న హోటళ్ల యజమానులు తమ షాపులను మూసివేశారు.