• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు: సీఐ

కర్నూలు: సోమవారం రాజు విహార్ సెంటర్లో జిల్లా టౌన్ DSP బాబు ప్రసాద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లైసెన్స్‌లపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించామన్నారు.

March 24, 2026 / 06:41 AM IST

ఆకివీడులో DYFI భారీ ర్యాలీ

W.G: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆకివీడులో సోమవారం రాత్రి DYFI ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దొరగారి చెరువు నుంచి ఎస్ టర్నింగ్ వరకు జాతీయ రహదారి గుండా ఈ ర్యాలీ సాగింది. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు, బివీ వర్మ, పెంకి అప్పారావు పాల్గొన్నారు.

March 24, 2026 / 06:40 AM IST

అభివృద్ధి పథంలో కోవూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే

NLR: కోవూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో రూ. 47 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ గురించి ప్రజలకు వివరించారు.

March 24, 2026 / 06:35 AM IST

ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు..!

ELR: చింతలపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రగడవరం గ్రామంలో కొనకళ్ల జయమ్మ, కాగిత నాగేశ్వరరావు అక్రమ మద్యం కలిగి ఉండటంతో వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులను 129 బీఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం బైండోవర్ చేసినట్లు తెలిపారు.

March 24, 2026 / 06:35 AM IST

గార్లదిన్నెలో అక్రమ గ్యాస్ సిలిండర్ల పట్టివేత

ATP: గార్లదిన్నె మండలం కల్లూరులోని గపూర్ చికెన్ సెంటర్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 26 గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ ఎస్సై నరేంద్ర భూపతి యాదవ్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు.

March 24, 2026 / 06:30 AM IST

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ.3.07 లక్షలు

SKLM: నరసన్నపేట మండలం వేంకటేశ్వర ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. ఈవో పి. మాధవి ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కించగా రూ.3.07 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయ ధర్మకర్త పొట్నూరు చినవీరభద్రస్వామి, ప్రధాన అర్చకుడు ఛామర్తి సాయికృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

March 24, 2026 / 06:28 AM IST

వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కారం..!

అన్నమయ్య: జిల్లాలో వెబ్ ల్యాండ్‌కు సంబంధించిన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ నిశాంత్ పరిష్కరించారు. మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్ల పరిధిలో 10 మంది రైతులకు 1B పత్రాలను అందజేశారు. అలాగే 22A భూ సమస్యలు ఈ నెలలోనే డజన్ల కొద్దీ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రైతులకు భూ రికార్డులు సక్రమంగా ఉండేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

March 24, 2026 / 06:27 AM IST

‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’

అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు డిమాండ్ చేశారు. పిరికిపందలు ఇటువంటి చర్యలకు పాల్పడతారని విమర్శించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులు ఎస్ తాతాజీ, కె సత్యనారాయణ పాల్గొన్నారు.

March 24, 2026 / 06:25 AM IST

బాలాజీ ఆరోగ్య వర ప్రసాదినికి భారీ విరాళం

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.11 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈ మొత్తాన్ని విరాళంగా అందించింది. పేద రోగుల వైద్య సేవల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని టీటీడీ ఈవోకు రసీదు అందజేశారు. ఈ సహాయంతో ఈవో దాతలను అభినందించారు.

March 24, 2026 / 06:20 AM IST

కలెక్టర్‌కు చిత్రపటాన్ని బహుమతిగా అందజేసిన విద్యార్థి

బాపట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో చదివే మూడో తరగతి విద్యార్థి అక్కి శ్రీరామ్ రిషిత్ యాదవ్ జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ చిత్రపటాన్ని గీసి బహుమతిగా అందజేశాడు. కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులతో కలిసి చిత్రపటాన్ని అందించారు. కలెక్టర్ వినోద్ కుమార్ విద్యార్థిని అభినందించి ఆశీర్వదించారు.

March 24, 2026 / 06:19 AM IST

నేడు సోంపేటలో మెగా జాబ్ మేళా

SKLM: సోంపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా లో 12 పరిశ్రమలు పాల్గొని, 365 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 24, 2026 / 06:17 AM IST

నేడు సర్పంచుల చివరి జనరల్ బాడీ సమావేశం: MPDO

PPM: పాచిపెంట MPDO కార్యాలయంలో మంగళవారం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు MPDO బీవీజే పాత్రో సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. సర్పంచుల పదవి కాలం వచ్చే నెల 2తో ముగియనుండటంతో సర్పంచ్‌లకు ఇదే చివరి సభ అని, వారికి వీడ్కోలు కూడా ఈ సభలో నిర్వహిస్తామన్నారు.

March 24, 2026 / 06:17 AM IST

నేడే బార్ అసోసియేషన్ ఎన్నికలు..!

KRNL: బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు విజయభాస్కర్ రెడ్డి, వీరేష్, హుస్సేన్ సాని, శ్రీధర్ సింగ్ తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. పోలింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

March 24, 2026 / 06:16 AM IST

ANU బీటెక్ పరీక్షల ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన 4/4 బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. 96.29% ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్, ఫీజు వివరాలకు www.nagarjunauniversity.ac.in⁠ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

March 24, 2026 / 06:15 AM IST

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు కలెక్టర్ శ్రీకారం

అన్నమయ్య: ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం చుట్టారు. 100 రోజుల పాటు మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తూ హై రిస్క్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఛాతీ ఎక్స్-రే సహా పరీక్షలు చేసి వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

March 24, 2026 / 06:13 AM IST