• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చంద్రశేఖరపురంలో సీపీఐ ధర్నా

ప్రకాశం: చంద్రశేఖరపురం మండల కేంద్రంలో మంగళవారం సీపీఐ నాయకులు మస్తాన్వలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ నివేశ స్థలాలు ఇవ్వాలని, అలాగే సాగు చేసుకునేందుకు భూమి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ.. పేదల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం తాసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

March 24, 2026 / 02:01 PM IST

గుత్తిలో బీఎస్పీ నాయకుల సంబరాలు

ATP: ఆర్డీటీ సంస్థకు FCRA లైసెన్స్‌ను 2031 వరకు కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడంపై గుత్తిలో బీఎస్పీ నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా ఉత్తర్వులు రావడం శుభపరిణామమని నియోజకవర్గ, మండల నాయకులు పేర్కొన్నారు. అనంతరం సంబరాలు చేశారు.

March 24, 2026 / 02:00 PM IST

‘వ్యాక్సిన్ వేయించడం వల్ల క్షయ వ్యాధిని అరికట్టవచ్చు’

నంద్యాల: నవజాత శిశువులకు బీసీజీ వ్యాక్సిన్ వేయించడం వల్ల క్షయ వ్యాధిని అరికట్టవచ్చని డా.షాహలాం అన్నారు. మంగళవారం చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాహలాం మాట్లాడుతూ.. క్షయ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ మహమ్మారిని అంతం చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.

March 24, 2026 / 02:00 PM IST

విద్యుత్ షాక్‌కు గురై కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

E.G: కొవ్వూరు పట్టణ పరిధిలోని నందమూరులో విద్యుత్ షాక్‌కు గురై శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. కాగా రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

March 24, 2026 / 02:00 PM IST

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి: కదిరి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, పనుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్‌ దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

March 24, 2026 / 02:00 PM IST

గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆందోళన

KRNL: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తూ సామాన్య ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఇవాళ పత్తికొండలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. గ్యాస్ 10 రోజుల క్రితం బుక్ చేసుకున్నా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.

March 24, 2026 / 02:00 PM IST

ఇళ్ల స్థలాల స్కామ్‌పై మంత్రి నాదెండ్ల సీరియస్

GNTR: గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో పేదలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డీఎస్పీని ఆదేశించారు. గృహ నిర్మాణాల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదులపై విచారణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, స్కామ్‌లో ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.

March 24, 2026 / 02:00 PM IST

తేనెటీగలు దాడి.. వృద్ధురాలికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలోని కొటావారిపల్లికి చెందిన చంద్రమ్మ(60)పై మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనె ఈగలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.

March 24, 2026 / 01:59 PM IST

క్షయవ్యాధి అవగాహన ర్యాలీలో పాల్గొన్న జేసీ

E.G: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వై.జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ వై.మేఘా స్వరూప్ హాజరై మాట్లాడారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశం అన్నారు.

March 24, 2026 / 01:30 PM IST

పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హై స్కూల్‌ను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యల గురించి ఆరా తీశారు. అలాగే, నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.

March 24, 2026 / 01:30 PM IST

ప్రజా దర్బార్‌లో 168 అర్జీలు: మంత్రి సుభాష్

కోనసీమ: రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజల ద్వారా 168 అర్జీలు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర అంశాలపై అర్జీలు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

March 24, 2026 / 01:30 PM IST

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు..!

W.G: ఆకివీడు పట్టణ శివారు దుంపగడప రైల్వే గేట్ సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరగనున్న శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు.

March 24, 2026 / 01:27 PM IST

నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస మండలం పరిషత్ కార్యాలయాన్ని రూ.32 లక్షల రూపాయలతో ఆధునీకరించిన భవనాన్ని రాష్ట్ర పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు అత్యున్నత సేవలు అందాలంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆఫీసులు నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపిడిఓ, సర్పంచులు ఉన్నారు.

March 24, 2026 / 01:26 PM IST

గుడికల్ చెరువు నీరు కలుషితం: గడ్డం నాగేంద్ర

KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ చెరువు నీరు తీవ్రంగా కలుషితమైందని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర ఇవాళ ఆరోపించారు. మురుగు, రసాయన వ్యర్థాల వల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 10 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే నిరసనలు చేపడతామన్నారు.

March 24, 2026 / 01:26 PM IST

పులివెందులలో ఉద్యోగ సంఘల నిరాహార దీక్ష..!

KDP: పులివెందులో ఉద్యోగ సంఘాలు మంగళవారం మినీ సెక్రటేరియట్ ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు నేతృత్వంలో దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే పీఆర్సీ అమలు చేసి పెండింగ్ బకాయిలు, మెడికల్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

March 24, 2026 / 01:25 PM IST